23.7 C
Hyderabad
Monday, March 17, 2025
spot_img

రైలు ప్రమాద బాధితులకు ఏపీ ప్రభుత్వం పరిహారం

స్వతంత్ర, వెబ్ డెస్క్: ఒడిశా రైలు ప్రమాదంలో మరణించిన శ్రీకాకుళం జిల్లాకు చెందిన గురుమూర్తి కుటుంబానికి ఏపీ ప్రభుత్వం పరిహారం ప్రకటించింది. ప్రమాదం ఘటనలో సహాయక చర్యలపై అధికారులతో సీఎం జగన్ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మృతిచెందిన గురుమూర్తి కుటుంబానికి రూ.10లక్షలు ఎక్స్‌గ్రేషియా ప్రకటించారు. తీవ్రంగా గాయపడిన వారికి రూ.5లక్షలు, స్వల్పంగా గాయపడిన వారికి రూ.లక్ష చొప్పున ఇవ్వాలని అధికారులను ఆదేశించారు. కేంద్రం సాయానికి అదనంగా ఈ పరిహారం ఇవ్వాలని సూచించారు. కాగా బాలాసోర్‌లో గురుమూర్తి ఉంటుండగా.. పెన్షన్ కోసం స్వస్థలం వచ్చి వెళ్తుండగా రైలు ప్రమాదంలో మృతి చెందినట్లు అధికారులు తెలిపారు. రాష్ట్రానికి చెందిన బాధితులను గుర్తించే పనిలో ఉన్నట్లు వివరించారు.

 

Latest Articles

‘కాలమేగా కరిగింది’ ట్రైలర్ చూశారా?

వినయ్ కుమార్, శ్రావణి మజ్జరి, అరవింద్ ముదిగొండ, నోమిన తార ప్రధాన పాత్రల్లో నటిస్తున్న సినిమా "కాలమేగా కరిగింది". ఈ సినిమాను శింగర క్రియేటివ్ వర్క్స్ బ్యానర్ పై మరే శివశంకర్ నిర్మిస్తున్నారు....
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్