ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఇవాళ కుంభమేళాకు వెళ్తున్నారు. కుటుంబ సమేతంగా ఆయన త్రివేణి సంగమంలో పుణ్య స్నానం ఆచరించనున్నారు. ఇప్పటికే దక్షిణాది రాష్ట్రాల ఆలయాల సందర్శనను విజయవంతగా పూర్తిచేసుకున్నారు పవన్. తన కొడుకు అకీరాతో కలిసి కేరళ, తమిళనాడులోని ప్రసిద్ధ ఆలయాలను గతవారం సందర్శించాడు. తాజాగా ఉత్తరాదికి వెళుతున్నాడు పవన్. ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్లో జరుగుతున్న కుంభమేళాకు నేడు పవన్ కళ్యాణ్ వెళ్లనున్నారు.