33.1 C
Hyderabad
Saturday, April 19, 2025
spot_img

తణుకులో అఘోరి హల్‌చల్‌.. పెట్రోల్‌ పోసుకుని ఆత్మహత్యాయత్నం

పశ్చిమగోదావరి జిల్లా తణుకులో అఘోరి హల్‌చల్‌ చేశారు. పెట్రోల్‌ పోసుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. తణుకు పట్టణానికి చెందిన రాజేష్ నాథ్‌.. అఘోరి ముసుగులో అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతున్నాడని తణుకు పట్టణ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని ఆమె ఆరోపించారు.

హౌసింగ్ బోర్డ్ కాలనీలోని రాజేష్ అఘోరియా ఇంటి వద్దకు వెళ్లి రాజేష్ నాథ్‌ను చంపుతానంటూ బెదిరించారు. అక్కడి నుంచి తణుకు పోలీస్‌ స్టేషన్‌కు వెళ్లారు. రాజేష్‌ నాథ్‌ అఘోరిపై కేసు నమోదు చేయాలని డిమాండ్‌ చేశారు. దానికి సంబంధించిన ఎఫ్‌ఐఆర్‌ కాపీ ఇవ్వాలని ఆందోళన చేపట్టారు. పోలీసులు స్పందించడం లేదని పోలీస్ స్టేషన్ ఎదుట పెట్రోలు పోసుకొని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు.

మహిళా పోలీసులు ఇద్దరు ఆమెను ఆపే ప్రయత్నం చేశారు. ఆమె ఒంటిపై పెట్రోల్‌ డబ్బాతో పెట్రోల్‌ పోసుకోవడానికి ప్రయత్నించారు. మహిళా పోలీసులు ఆమెను పట్టుకుని పెట్రోల్‌ లాక్కుని ఆపే ప్రయత్నం చేశారు. అక్కడున్న స్థానికులు, పోలీసులు ఆమె ఒంటిపై నీళ్లు పోశారు. ఈ సందర్భంగా కాసేపు అఘోరికి, పోలీసులకు మధ్య పెనుగులాట చోటుచేసుకుంది.

అఘోరి మాట్లాడుతూ.. పెట్రోల్‌ ఎప్పుడూ తనతో ఉంటుందని.. లాంగ్‌ జర్నీ చేస్తాను కాబట్టి పెట్రోల్‌ అవసరం ఎప్పుడు వస్తుందో తెలియదు కాబట్టి ఎప్పుడూ పెట్రోల్ డబ్బాను క్యారీ చేస్తానని అఘోరి తెలిపారు.

Latest Articles

ఆస్పత్రుల్లో జరిగే అన్యాయాలపై పోరాటమే ‘డియర్ ఉమ’

తెలుగమ్మాయి అయిన సుమయ రెడ్డి హీరోయిన్‌గా, నిర్మాతగా, రచయితగా ‘డియర్ ఉమ’ అనే చిత్రం నేడు ఏప్రిల్ 18న విడుదలైంది. ఈ చిత్రంలో పృథ్వీ అంబర్ హీరోగా నటించారు. ఈ మూవీకి లైన్...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్