Andrapradesh | తిరుపతి జిల్లా చంద్రగిరి మండలం ఏ.రంగంపేట గ్రామంలో భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. మంటలన్నీ ఒక్కసారిగా వ్యాపించడంతో షాపులో ఉన్న పెట్రోల్, డీజిల్, వంట నూనె అంటుకుని మంటలు ఎగసిపడ్డాయి. ఈ క్రమంలో అక్కడే ఉన్న వృద్దురాలు మునిరాజమ్మ మంటల్లో చిక్కుకుంది. ఇది గమనించిన గ్రామస్తులు గోడలు పగులగొట్టి మునిరాజమ్మను కాపాడారు. ప్రస్తుతం మునీరాజమ్మ పరిస్థితి విషమంగా ఉండటంతో ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనకు సంభందించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.