ఖమ్మం జిల్లాలో 5 రోజుల క్రితం కిడ్నాప్ అయిన పసి బాలుడి జాడ ఇప్పటికీ తెలియరాలేదు. సత్తుపల్లి గుడిపాడులో అర్థరాత్రి తల్లి పక్కలో నుంచి అదృశ్యమయ్యాడు దేవాన్ష్. అయితే, 5 రోజులయినా తమ బిడ్డ ఆచూకీ తెలియకపోవ డంతో కన్నీరు మున్నీరుగా విలపిస్తోంది బాలుడి తల్లి. ఎలాగైన తన బిడ్డను వెతికి తీసుకురావాలని పోలీసులకు మొరపెట్టుకుంటోంది. అయితే, రెండు బృందాలుగా బాలుడి కోసం గాలిస్తున్నామని, త్వరలోనే దేవాన్ష్ ఆచూకీ కనుక్కుని తల్లిదండ్రులకు అప్పగిస్తామని చెబుతున్నారు సత్తుపల్లి సీఐ కిరణ్.