35.2 C
Hyderabad
Sunday, May 11, 2025
spot_img

అసెంబ్లీ ఎన్నికల్లో కూడా ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలే వస్తాయి: పవన్

గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలపై జనసేన అధినేత పవన్ కల్యాణ్ స్పందించారు. ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలతో ప్రజల్లో ప్రభుత్వంపై వ్యతిరేకత కనిపించిందని తెలిపారు. ఈ ఫలితాలు వైసీపీ ప్రభుత్వానికి హెచ్చరిక అని ఓ ప్రకటన విడుదల చేశారు. అధికారం తలకెక్కిన వైసీపీ నేతలకు పట్టభద్రులు తమ ఓటు ద్వారా కనువిప్పు కలిగించారని పేర్కొన్నారు. సందిగ్ధంలో ఉన్నవారికి పట్టభద్రులు దారిచూపించారని వివరించారు. ఈ ఫలితాలు ప్రజల ఆలోచన ధోరణిని తెలియజేస్తున్నాయన్నారు. వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో కూడా ఇలాంటి ఫలితమే వస్తుందన్నారు. ప్రజావ్యతిరేక పాలనకు వ్యతిరేకంగా ఓటు వేసిన ప్రతి ఒక్క పట్టభద్రుడికి అభినందనలు తెలిపారు పవన్.

Latest Articles

‘టిఎస్ఆర్ మూవీ మేకర్స్’ ప్రొడక్షన్ నం. 3 ఫస్ట్ షెడ్యూల్ స్టార్ట్

టిఎస్ఆర్ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నిర్మితమవుతున్న ప్రొడక్షన్ నెంబర్ 3, ప్రేమ మరియు కుటుంబ బంధాలను అద్భుతంగా ఆవిష్కరించే ఒక హృదయస్పర్శి చిత్రంగా రూపొందుతోంది. ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత తిరుపతి శ్రీనివాసరావు...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్