అసెంబ్లీ ఎన్నికల్లో కూడా ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలే వస్తాయి: పవన్

గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలపై జనసేన అధినేత పవన్ కల్యాణ్ స్పందించారు. ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలతో ప్రజల్లో ప్రభుత్వంపై వ్యతిరేకత కనిపించిందని తెలిపారు. ఈ ఫలితాలు వైసీపీ ప్రభుత్వానికి హెచ్చరిక అని ఓ ప్రకటన విడుదల చేశారు. అధికారం తలకెక్కిన వైసీపీ నేతలకు పట్టభద్రులు తమ ఓటు ద్వారా కనువిప్పు కలిగించారని పేర్కొన్నారు. సందిగ్ధంలో ఉన్నవారికి పట్టభద్రులు దారిచూపించారని వివరించారు. ఈ ఫలితాలు ప్రజల ఆలోచన ధోరణిని తెలియజేస్తున్నాయన్నారు. వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో కూడా ఇలాంటి ఫలితమే వస్తుందన్నారు. ప్రజావ్యతిరేక పాలనకు వ్యతిరేకంగా ఓటు వేసిన ప్రతి ఒక్క పట్టభద్రుడికి అభినందనలు తెలిపారు పవన్.

Latest Articles

నేను బీఆర్ఎస్ కు దూరమవుతున్నానని… మల్లారెడ్డి వ్యాఖ్యలపై చర్చ

మేడ్చల్‌లో మాజీ మంత్రి మల్లారెడ్డి వీడియో వైరల్ అయింది. ఒక కార్యకర్త పుట్టిన రోజు వేడుకల్లో మల్లారెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. తాను బీఆర్ఎస్‌కు దూరమవుతున్నానని.. తనను మర్చిపోతున్నారని అన్నారు. స్వయంగా మల్లారెడ్డి...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

5,500FansLike
31,700FollowersFollow
348FollowersFollow
426,004SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్