హైదరాబాద్ ఎల్బినగర్ లో అగ్ని ప్రమాదం జరిగింది. చైతన్యపురి పోలీస్ స్టేషన్ పరిధిలోని మోహన్ నగర్ లోని ఓ ఓయో హోటల్ లో తెల్లవారుజామున మంటలు చెలరేగాయి. సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది ఘటనా స్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు.మూడు ఫైర్ ఇంజెన్ లతో మంటలను అదుపులోకి తెచ్చారు. మంటల్లో చిక్కుకున్న ఎనిమిది మందిని ఎల్బీ నగర్ పైర్ సిబ్బంది కాపాడారు. పొగకు ఊపిరి ఆడక ఇద్దరికీ అస్వస్థతకు గురయ్యారు. దాంతో వారిని ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు.


