ఉత్తరాఖండ్‌లో పెను ప్రమాదం.. మంచు చరియలు విరిగిపడి చిక్కుకున్న 47 మంది కార్మికులు

ఉత్తరాఖండ్‌లో గత కొన్ని రోజులుగా భారీగా మంచు కురుస్తుండడంతో శుక్రవారం పెను ప్రమాదం చోటుచేసుకుంది. మంచు చరియలు విరిగిపడి కార్మికులు సుమారు 57 మంది చిక్కుకుపోయయారు. కార్మికులు అక్కడ రోడ్డు నిర్మాణ పనులు చేస్తుండగా ఈ ప్రమాదం జరిగినట్టు తెలుస్తోంది.

ఉత్తరాఖండ్‌లోని చమోలి జిల్లాలో ఈ ఘటన జరిగింది. హిమపాతం విరిగిపడి 57 మంది కార్మికులు మానా గ్రామంలో సమాధి అయినట్లు తెలుస్తోంది. వీరిలో 10 మంది కార్మికులను సహాయక బృందాలు రక్షించి సురక్షితంగా బయటకు తీసుకువచ్చారు. సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ఈ సంఘటన బద్రీనాథ్ ధామ్‌కు 3 కి.మీ దూరంలో జరిగింది.

ఎస్డీఆర్‌ఎఫ్‌, ఎన్డీఆర్‌ఎఫ్‌, ఐటీబీపీ, బీఆర్ఓ బృందాలు ఘటన జరిగిన వెంటనే ఘటనాస్థలికి చేరుకున్నాయి.

భారత వాతావరణ శాఖ (IMD) ఉత్తరాఖండ్‌తో సహా అనేక కొండ ప్రాంతాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. శుక్రవారం అర్థరాత్రి వరకు అతి భారీ వర్షాలు (20 సెం.మీ. వరకు) కురుస్తాయని అంచనా వేసింది.

భారీ వర్షాల ప్రభావం ఉంటుందని ఐఎండీ అంచనా వేసింది. స్థానిక రోడ్లపై వరదలు, లోతట్టు ప్రాంతాలలో నీరు నిలిచిపోవడం, ప్రధానంగా పట్టణ ప్రాంతాల్లో అండర్‌పాస్‌లో నీరు నిలిచిపోతుందని IMD అంచనా వేసింది. భారీ వర్షాల కారణంగా విజన్‌ లేకపోవడం.. ట్రాఫిక్ అంతరాయం కారణంగా వాహనదారులకు ఇబ్బందులు, పలు చోట్ల రోడ్లకు స్వల్ప నష్టం వాటిల్లుతుందని అధికారులు అంచనా వేశారు.

Latest Articles

చంద్రబాబు తన మంత్రివర్గాన్ని త్వరలో ప్రక్షాళన చేయబోతున్నారా?

ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గంలో త్వరలోనే భారీ ప్రక్షాళన జరగబోతోంది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత యువతకు, కొత్త వారికి పెద్దపీట వేసిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు.. ఇప్పుడు తన వ్యూహాన్ని పూర్తిగా మార్చుకున్నారు....
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్