29.9 C
Hyderabad
Monday, June 9, 2025
spot_img

పేదలకు గ్రామాల్లో 3, పట్టణాల్లో 2 సెంట్ల ఇంటిస్థలం ఇవ్వాలి- సీపీఐ

పేదలకు గ్రామాల్లో మూడు సెంట్లు, పట్టణాల్లో రెండు సెంట్ల ఇంటి స్థలాలు ఇవ్వాలని సీపీఐ నేతలు డిమాండ్ చేశారు. అనంతపురం ఆర్డీఓ ఆఫీసు వద్ద వారు నిరసన కార్యక్రమం చేపట్టారు. రాష్ట్రవ్యాప్తంగా ఇంటి స్థలాల కోసం లక్షల్లో దరఖాస్తులు చేసుకుంటున్నారని సీపీఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు జగదీష్‌ తెలిపారు. కానీ రాష్ట్ర మంత్రి అనగాని సత్యప్రసాద్ 75 వేల అప్లికేషన్లు వచ్చాయని చెప్పడం హాస్యాస్పదం అన్నారు. వైసీపీ హయాంలో ఆన్‌లైన్‌లో ఉన్న లబ్ధిదారుల వివరాలను డిలీట్ చేస్తే.. రాష్ట్రవ్యాప్తంగా లక్షల్లో లబ్ధిదారులు ఇంటి స్థలాల కోసం దరఖాస్తు చేస్తారని చెప్పారు. పేదల ప్రభుత్వంగా చెప్పుకునే కూటమి సర్కార్‌ లబ్ధిదారులకు న్యాయం చేయాలని జగదీష్‌ డిమాండ్ చేశారు.

Latest Articles

‘టిఎస్ఆర్ మూవీ మేకర్స్’ ప్రొడక్షన్ నం. 3 ఫస్ట్ షెడ్యూల్ స్టార్ట్

టిఎస్ఆర్ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నిర్మితమవుతున్న ప్రొడక్షన్ నెంబర్ 3, ప్రేమ మరియు కుటుంబ బంధాలను అద్భుతంగా ఆవిష్కరించే ఒక హృదయస్పర్శి చిత్రంగా రూపొందుతోంది. ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత తిరుపతి శ్రీనివాసరావు...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్