బుల్లితెర మేకప్మెన్ చుక్కా చెన్నయ్య అలియాస్ తరుణ్తేజ్ హత్యకు గురయ్యాడు. జూబ్లీహిల్స్ రహ మత్నగర్ కార్మికనగర్ లోని నిమ్స్ మైదానం లోపల గోడ వద్ద మృతదేహాన్ని పోలీసులు గుర్తించారు. 28 ఏళ్ల తరుణ్ మహబూబ్నగర్ వనపర్తి ప్రాంతానికి చెందిన వ్యక్తిగా పోలీసులు తెలిపారు. ఎస్సార్ నగర్ ఏసీపీ వెంకటరమణ ఘటనాస్ధలాన్ని పరిశీలించారు. దుండగులు మారణాయుధాలను వినియోగించి హత్యకు పాల్పడినట్లు భావిస్తున్నారు. క్లూస్ టీం, డాగ్ స్క్వాడ్స్తోపాటు సీసీ టీవీ ఫుటేజీల ఆధారంగా దర్యాప్తును వేగవంతం చేసారు బోరబండ పోలీసులు.