23.7 C
Hyderabad
Monday, March 17, 2025
spot_img

జీ-20 సదస్సులో ముఖ్య అతిథిగా పాల్గొన్న రామ్ చరణ్

స్వతంత్రటీవీ, వెబ్ డెస్క్: శ్రీనగర్ లో జరుగుతున్న జీ20 టూరిజం వర్కింగ్ గ్రూప్ సదస్సుకు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఇండియన్ మూవీ ఇండస్ట్రీ తరపున అతిథిగా హాజరయ్యారు. శ్రీనగర్ ఎయిర్ పోర్టుకు చేరుకున్న చెర్రీకి సంప్రదాయ రీతిలో స్వాగతం పలికారు. అనంతరం జీ-20 సదస్సు వేదిక వద్దకు చేరుకున్న చరణ్ తో ఫొటోలు దిగేందుకు ఆసక్తి చూపించారు. అంతేకాదు వేదికపై నాటు నాటు పాటకు స్టెప్పులు కూడా వేశారు.

                                     

ఈ సదస్సుకు హాజరైన కేంద్ర పర్యాటక శాఖ మంత్రి కిషన్ రెడ్డి చెర్రీకి శాలువా కప్పి, జ్ఞాపిక అందజేశారు. అనంతరం వేదికపై పలు అంశాల గురించి చరణ్ మాట్లాడారు. ఈ వేదికకు తనను ఆహ్వానించిన వారికి ధన్యవాదాలు తెలిపారు. కాగా ఆర్టికల్ 370ని కేంద్రం రద్దు చేసిన తర్వాత అంతర్జాతీయ స్థాయి కార్యక్రమం నిర్వహించడం ఇదే తొలిసారి కావడంతో భారీ ఎత్తున బందోబస్తు ఏర్పాటు చేశారు.

Latest Articles

‘కాలమేగా కరిగింది’ ట్రైలర్ చూశారా?

వినయ్ కుమార్, శ్రావణి మజ్జరి, అరవింద్ ముదిగొండ, నోమిన తార ప్రధాన పాత్రల్లో నటిస్తున్న సినిమా "కాలమేగా కరిగింది". ఈ సినిమాను శింగర క్రియేటివ్ వర్క్స్ బ్యానర్ పై మరే శివశంకర్ నిర్మిస్తున్నారు....
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్