21.7 C
Hyderabad
Wednesday, January 15, 2025
spot_img

కేటీఆర్‌ వెంట లాయర్‌ వెళ్లేందుకు హైకోర్టు అనుమతి

ఫార్ములా ఈ రేసు కేసులో గురువారం మాజీ మంత్రి కేటీఆర్‌ ఏసీబీ విచారణకు హాజరుకానున్నారు. ఏసీబీ విచారణకు కేటీఆర్‌ వెంట న్యాయవాదిని తీసుకెళ్లేందుకు తెలంగాణ హైకోర్టు అనుమతించింది. విచారణ ఆడియో, వీడియో రికార్డు చేసేందుకు ఉన్నత న్యాయస్థానం నిరాకరించింది. కేటీఆర్‌ దాఖలు చేసిన లంచ్‌ మోషన్‌ పిటిషన్‌పై హైకోర్టు విచరణ చేపట్టింది. ఏసీబీ విచారణకు వెళ్లే సమయంలో తన వెంట న్యాయవాదిని అనుమతించేలా ఆదేశాలు ఇవ్వాలంటూ పిటిషన్‌లో పేర్కొన్నారు. విచారణకు వెళ్లే సమయంలో న్యాయవాదిని అనుమతిస్తూ సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పులను కేటీఆర్‌ తరఫు న్యాయవాది కోర్టు దృష్టికి తీసుకెళ్లారు.

న్యాయవాది రామచంద్రరావు కేటీఆర్‌ వెంట విచారణకు హాజరవుతారని ఆయన తరఫు న్యాయవాది కోర్టుకు తెలిపారు. కేటీఆర్‌ విచారణను ఆడియో, వీడియో రికార్డు చేయాలని న్యాయవాది కోరారు. అందుకు హైకోర్టు నిరాకరించింది. లాయర్ లైబ్రరీలో కూర్చుంటే కేటీఆర్ విచారణ కనిపిస్తుందని ఈ సందర్భంగా ఏఏజీ ధర్మాసనం దృష్టికి తీసుకెళ్లారు. న్యాయవాదితో కలిసి గురువారం ఏసీబీ విచారణకు వెళ్లాలని న్యాయస్థానం కేటీఆర్‌కు సూచించింది. గురువారం విచారణ తర్వాత ఏవైనా అనుమానాలుంటే మళ్లీ న్యాయస్థానాన్ని ఆశ్రయించవచ్చని హైకోర్టు తెలిపింది.

Latest Articles

కాళేశ్వర ముక్తేశ్వర ఆలయ అభివృద్ధికి సహకరించండి- శ్రీధర్‌బాబు

'కాళేశ్వరం – మంథని – రామగిరి’ని ఆధ్యాత్మిక, వారసత్వ పర్యాటక సర్క్యూట్‌గా గుర్తించి అభివృద్ధి చేయాలని కేంద్ర సాంస్కృతిక, పర్యాటక మంత్రి గజేంద్రసింగ్ షేకావత్‌ను తెలంగాణ ఐటీ, పరిశ్రమల శాఖా మంత్రి శ్రీధర్...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్