29.9 C
Hyderabad
Tuesday, June 10, 2025
spot_img

రేపు వైఎస్సార్ వాహనమిత్ర ఐదో విడత నిధుల విడుదల

స్వతంత్ర వెబ్ డెస్క్: ఏపీ సీఎం జగన్ సెప్టెంబరు 29న విజయవాడలో పర్యటించనున్నారు. ఈ పర్యటనలో భాగంగా… వైఎస్సార్ వాహనమిత్ర 5వ విడత నిధులు విడుదల చేయనున్నారు. ఈ కార్యక్రమం నగరంలోని విద్యాధరపురం స్టేడియంలో జరగనుంది. రాష్ట్రంలో ఆటోలు, క్యాబ్ లు నడుపుకుంటూ ఉపాధి పొందుతున్న వారికి జగన్ ప్రభుత్వం ఏడాదికి రూ.10 వేలు చొప్పున సాయం అందిస్తోంది. ఏపీలో వైసీపీ అధికారంలోకి వచ్చాక ఇప్పటివరకు వాహనమిత్ర పథకంలో భాగంగా నాలుగు పర్యాయాలు నిధులు విడుదల చేశారు. కాగా, రేపటి పర్యటన కోసం సీఎం జగన్ ఉదయం 10.15 గంటలకు తాడేపల్లి నివాసం నుంచి బయల్దేరనున్నారు. విద్యాధరపురం స్టేడియంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో పాల్గొని, బటన్ నొక్కి నిధులు విడుదల చేస్తారు. సభ ముగిసిన అనంతరం తిరిగి తాడేపల్లి చేరుకుంటారు. ఈ మేరకు జిల్లా అధికార యంత్రాంగం ఏర్పాట్లు చేసింది.

Latest Articles

‘టిఎస్ఆర్ మూవీ మేకర్స్’ ప్రొడక్షన్ నం. 3 ఫస్ట్ షెడ్యూల్ స్టార్ట్

టిఎస్ఆర్ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నిర్మితమవుతున్న ప్రొడక్షన్ నెంబర్ 3, ప్రేమ మరియు కుటుంబ బంధాలను అద్భుతంగా ఆవిష్కరించే ఒక హృదయస్పర్శి చిత్రంగా రూపొందుతోంది. ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత తిరుపతి శ్రీనివాసరావు...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్