స్వతంత్ర, వెబ్ డెస్క్: టీడీపీలో బలమైన దళిత, బీసీ నాయకత్వం మీద వైసీపీ కక్ష సాధింపు చర్యలకు దిగుతుందని టీడీపీ సీనియర్ నేత ధూళిపాళ్ళ నరేంద్ర కుమార్ వ్యాఖ్యానించారు. కొండేపి శాసన సభ్యుడు, దళిత నాయకుడు డోలా వీరాంజనేయ స్వామి మీద ప్రభుత్వం కక్షసాధింపు చర్యలు చేపడుతుందని ఆక్షేపించారు. పదే పదే స్వామినే లక్ష్యంగా దాడులు వైసీపీ దాడులు చేయడం సరికాదని అన్నారు. అసెంబ్లీ సాక్షిగా స్వామిని దూషించి దాడికి దిగితే వైసీపీలోని దళిత నాయకులు ఒక్కరూ స్పందించలేదని మండిపడ్డారు. ప్రజల గళాన్ని పార్టీ గళాన్ని వినిపించి వీరోచితంగా పోరాడుతున్నందునే డోలా వీరాంజనేయ స్వామి మీద జగన్ కక్ష కట్టి ఇలాంటివి ప్రేరేపిస్తున్నారని అన్నారు. అవినీతి జరిగితే అధికారంలో ఉన్న మీరు చర్యలు చేపట్టకుండా.. కల్పిత ఆరోపణలు చేసి ఉద్దేశ్యపూర్వకంగా దాడులకు దిగుతారా? అంటూ మండిపడ్డారు. డోలా వీరాంజనేయ స్వామి మీద దాడి, పోలీసుల చర్యలను తీవ్రంగా ఖండిస్తున్నామని పేర్కొన్నారు.