పార్లమెంటు ఎన్నికల ఫలితాల్లో ప్రజల ఇచ్చిన తీర్పును శిరసావహిస్తున్నామని ఆదిలాబాద్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఆత్రం సుగుణ అన్నారు. నిర్మల్ జిల్లా కేంద్రంలోని డీసీసీ అధ్యక్షులు శ్రీహరిరావు నివాసంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆమె పాల్గొని మాట్లాడారు. రాష్ట్రంలో తమ ప్రభుత్వం అధికారం లో ఉంది గనుక రానున్న రోజుల్లో ప్రజలకు అందుబాటులో ఉంటూ, అభివృద్ధిలో భాగస్వాములు అవుతా మన్నారామె. అంతకు ముందు ఈనాడు గ్రూపు సంస్థల అధిపతి రామోజీరావు మృతికి ఆత్రం సుగుణ ప్రగాఢ సంతాపం తెలియజేశారు.


