25.7 C
Hyderabad
Sunday, March 16, 2025
spot_img

మహా శివరాత్రి కోసం వేములవాడ రాజన్న ఆలయం ముస్తాబు

మహా శివరాత్రి కోసం వేములవాడ రాజన్న ఆలయం ముస్తాబవుతోంది. ఈ నెల 25 నుంచి 27 వరకు మహాశివరాత్రి జాతర జరగనుంది. ఇందు కోసం అధికారులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. కోటీ 75 లక్షలతో భక్తులకు సౌకర్యాలు, వివిధ పనులు చేపట్టారు. ఆలయానికి రంగులు వేశారు. విద్యుత్ దీపాలను అలంకరిస్తున్నారు. చలువ పందిళ్లు, జాతర గ్రౌండ్లో భక్తులకు శివార్చన కార్యక్రమం ఏర్పాట్లు చేస్తున్నారు. శానిటేషన్ ఇతర ప్రత్యేక సిబ్బందిని నియమించి పనులు చేయిస్తున్నారు.

జాతరకు వచ్చే భక్తుల కోసం ఉచిత బస్సు సర్వీసులు ఏర్పాటు చేశారు. ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్, జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా ఆధ్వర్యంలో ఈఓ వినోద్‌రెడ్డి గతంలో సమీక్ష నిర్వహించారు. మహాశివరాత్రి సందర్భంగా జాతరకు వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని ఏర్పాట్లు పూర్తిచేసినట్లు ఆలయం ఈఓ వినోద్‌రెడ్డి తెలిపారు. జాతరకు సుమారు 5 లక్షల మంది భక్తులు వస్తారని అంచనా వేస్తున్నట్లు తెలిపారు.

Latest Articles

‘కాలమేగా కరిగింది’ ట్రైలర్ చూశారా?

వినయ్ కుమార్, శ్రావణి మజ్జరి, అరవింద్ ముదిగొండ, నోమిన తార ప్రధాన పాత్రల్లో నటిస్తున్న సినిమా "కాలమేగా కరిగింది". ఈ సినిమాను శింగర క్రియేటివ్ వర్క్స్ బ్యానర్ పై మరే శివశంకర్ నిర్మిస్తున్నారు....
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్