పవర్ స్టార్ అభిమానులకు మైత్రీ మూవీ మేకర్స్ సూపర్ అప్డేట్ ఇచ్చింది. హరీశ్ శంకర్ దర్శకత్వంలో పవన్ కల్యాణ్ హీరోగా ‘ఉస్తాద్ భగత్సింగ్’ సినిమా తెరకెక్కతుండగా.. మూవీకి సంబంధించిన ఎడిటింగ్ పనులు ప్రారంభమైనట్లు తెలిపింది. ఎడిటింగ్ రూంలో డైరెక్టర్ హరీశ్, నిర్మాత నవీన్ పూజలు చేస్తున్న ఫోటోలను ట్వీట్ చేసింది. ఇప్పటికే ప్రధాన తారాగణంపై మొదటి షెడ్యూల్ లో కొన్ని సన్నివేశాలు చిత్రీకరించారు. ఈ సినిమాలో లేటెస్ట్ యంగ్ బ్యూటీ శ్రీలీల పవన్ సరసన హీరోయిన్ గా నటిస్తోంది.
‘గబ్బర్ సింగ్’ వంటి బ్లాక్ బాస్టర్ హిట్ తర్వాత పవన్, హరీశ్ కలయికలో ఈ చిత్రం రానుండడంతో అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ కాంబినేషన్ అనౌన్స్ చేసిన దగ్గరి నుంచి ఈ సినిమాపై పవర్ స్టార్ ఫ్యాన్స్ బోలెడన్ని ఆశలు పెట్టుకున్నారు. తమ హీరోకు మళ్లీ ‘గబ్బర్ సింగ్’ లాంటి హిట్ కావాలని కోరుకుంటున్నారు. వచ్చే ఏడాది ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు రానున్నట్లు తెలుస్తోంది. మరోవైపు ప్రస్తుతం పవన్ కల్యాణ్ ‘ఓజీ’ సినిమా షూటింగ్ లో బిజీగా ఉన్నాడు.