స్వతంత్ర, వెబ్ డెస్క్: రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన ప్రశ్నపత్రాల లీక్ కేసు నిందితులను డీబార్ చేయాలని టీఎస్పీఎస్సీ కీలక నిర్ణయం తీసుకుంది. ఈ కేసులో అరెస్టు అయిన అభ్యర్థులపై కఠిన చర్యలు తీసుకుంది. ఈ క్రమంలో 37 మంది టీఎస్పీఎస్సీ నిర్వహించే ఏ పరీక్షలు కూడా ఇకపై రాయకూడదని స్పష్టం చేసింది. ఏవైనా అభ్యంతరాలుంటే రెండ్రోజుల్లో వివరణ ఇవ్వాలని 37 మందికి నోటీసులు జారీ చేసింది.