స్వతంత్ర టీవీ, వెబ్ డెస్క్: తమిళనాడులో 535 కోట్ల నగదుతో ట్రక్ లు రోడ్డుపైనే నిలిచిపోయింది. చెన్నై తాంబరం వద్ద బ్రేక్ డౌన్ అవ్వడంతో రోడ్డుపైనే రెండు ట్రక్లు ఆగిపోయాయి. దీంతో రోడ్డుపై భారీ ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. రిజర్వు బ్యాంక్ ఆఫ్ చెన్నై నుండి విల్లుపురం తరలిస్తుండగా ఈ ఘటన జరిగింది. ట్రక్ ఆగిపోవడంతో వెంటనే భారీ భద్రత కల్పించారు పోలీసులు. ట్రక్లో డబ్బులు ఉన్న సంగతి ఆనోటా ఈనోటా పాకడంతో పెద్దసంఖ్యలో స్దానికులు అక్కడ గుమిగూడారు.


