జులై 1 నుండి అమలయ్యే నూతన చట్టాలపై పోలీస్ అధికారులు, సిబ్బందికి అవగాహన కల్పించేందుకు వరంగల్లో ప్రత్యేక శిక్షణ తరగతులు కొనసాగుతున్నాయి. సీపీ అంబర్ కిషోర్ ఝా ఆదేశాల మేరకు వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో ఈ ప్రత్యేక శిక్షణ జరుగుతోంది. రాష్ట్ర పోలీస్ శిక్షణ కేంద్రంలో ముందుగా శిక్షణ పొందిన అధికారుల ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఈ శిక్షణ తరగతుల్లో పోలీస్ అధికారు లకు కొత్త చట్టాలపై అవగాహన కల్పిస్తున్నారు. భారతీయ న్యాయ సంహిత, భారతీయ నాగరిక్ సురక్ష సంహిత, భారతీయ సాక్ష్య అధినియం-2023 చట్టాలపై పూర్తి అవగాహన కల్పిస్తున్నట్లు అధికారులు తెలిపారు. ఇప్పటి వరకు 740 మంది పోలీస్ అధికారులు శిక్షణ పొందారని చెప్పారు.


