19.7 C
Hyderabad
Wednesday, December 3, 2025
spot_img

తిరుమలలో విషాదం.. ఆరేళ్ల చిన్నారిని బలితీసుకున్న చిరుత..!

స్వతంత్ర వెబ్ డెస్క్: తిరుమలలో(Thirumala) విషాద ఘటన చోటుచేసుకుంది. అలిపిరి(Alipiri) కాలినడక మార్గంలో ఆరేళ్ల బాలికపై చిరుత దాడి చేసింది. ఈ దాడిలో బాలిక మృతి చెందింది. శుక్రవారం రాత్రి 8 గంటల సమయంలో చిన్నారి లక్షిత కుటుంబ సభ్యులు అలిపిరి కాలినడక మార్గంలో శ్రీవారి దర్శనానికి బయలుదేరారు. రాత్రి 11 గంటలకు వారు లక్ష్మీనరసింహస్వామి గుడి వద్దకు చేరుకున్నారు. కుటుంబ సభ్యులకు కాస్త ముందు నడుస్తున్న బాలికపై అకస్మాత్తుగా చిరుత(Cheetah) దాడి చేసింది. కుటుంబసభ్యులు భయంతో పెద్దగా కేకలు వేయడంతో బాలికను అడవిలోకి ఈడ్చుకెళ్లింది.

దీంతో బాలిక తల్లిదండ్రులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. అయితే రాత్రి సమయం కావడంతో గాలింపు చర్యలు చేసేందుకు వీలుపడలేకవడంతో… శనివారం ఉదయం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. లక్ష్మీనరసింహస్వామి ఆలయానికి సమీపంలోనే బాలిక మృతదేహాన్ని పోలీసులు గుర్తించారు. చిన్నారి మృతదేహాన్ని చిరుత సగం తినేసినట్లు తెలుస్తోంది. బాధితులది నెల్లూరు జిల్లాలోని పోతిరెడ్డిపాలెం అని తెలుస్తోంది. చిరుత దాడిలో మృతి చెందిన బాలిక మృతదేహాన్ని తిరుపతిలోని రుయా ఆస్పత్రి మార్చురీకి తరలించారు. చిన్నారి లక్షిత మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహిస్తున్నారు. చిన్నారి లక్షిత తలపై తీవ్ర గాయాలు ఉన్నట్లు తెలుస్తోంది.

Latest Articles

‘టిఎస్ఆర్ మూవీ మేకర్స్’ ప్రొడక్షన్ నం. 3 ఫస్ట్ షెడ్యూల్ స్టార్ట్

టిఎస్ఆర్ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నిర్మితమవుతున్న ప్రొడక్షన్ నెంబర్ 3, ప్రేమ మరియు కుటుంబ బంధాలను అద్భుతంగా ఆవిష్కరించే ఒక హృదయస్పర్శి చిత్రంగా రూపొందుతోంది. ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత తిరుపతి శ్రీనివాసరావు...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్