24.9 C
Hyderabad
Wednesday, July 9, 2025
spot_img

అన్ని థియేటర్లలో టికెట్‌ ధర రూ.200- కర్ణాటక సీఎం సిద్ధరామయ్య

కర్ణాటకలో సినీ రంగంపై ప్రభుత్వం కీలక నిర్ణయాలు
రాష్ట్ర వ్యాప్తంగా అన్ని థియేటర్లలో రూ.200గా టికెట్ ధరలు
రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో కొత్త ఓటీటీ ప్లాట్‌ఫామ్
మైసూరులో 150 ఎకరాల్లో రూ.500 కోట్లతో ఫిల్మ్ సిటీ నిర్మాణం

బడ్జెట్‌లో సినిమా రంగంపై కర్ణాటక ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుంది. సినిమా రంగాన్ని ప్రోత్సహించడం కోసం రాష్ట్రంలోని అన్ని థియేటర్లలో అన్ని షోలకు టికెట్ ధరను రూ.200 గా నిర్ణయించింది. సామాన్యులకు కూడా సినిమాను అందుబాటులోకి తీసుకురావాలనే ఉద్దేశంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు సీఎం సిద్ధరామయ్య వెల్లడించారు. కన్నడ సినిమాలను ప్రమోట్‌ చేసేలా రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో నడిచే ఓటీటీ ప్లాట్‌ఫామ్‌ను కూడా అందుబాటులోకి తీసుకురానున్నట్లు సీఎం ప్రకటించారు. అంతర్జాతీయ ప్రమాణాలతో మైసూర్‌లో ఒక ఫిల్మ్‌సిటీ నిర్మించేందుకు 150 ఎకరాల భూమిని ఇస్తున్నట్లు ప్రకటించారు. దీని నిర్మాణానికి రూ.500 కోట్ల బడ్జెట్‌ను కేటాయిస్తున్నట్లు తెలిపారు.

2025-26కు సంబంధించిన కర్ణాటక బడ్జెట్‌ను ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి సిద్ధరామయ్య శుక్రవారం అసెంబ్లీలో ప్రవేశపెట్టారు. రూ.4,08,647 కోట్ల బడ్జెట్‌ను సభ ముందుకు తీసుకువచ్చారు. మౌలిక సదుపాయాలు, మతపరమైన కేటాయింపులు, సినిమా ప్రమోషన్స్‌, మహిళా సాధికారికత వంటి అంశాల గురించి ఈసారి బడ్జెట్‌లో కీలకంగా ప్రస్తావించారు.

Latest Articles

‘టిఎస్ఆర్ మూవీ మేకర్స్’ ప్రొడక్షన్ నం. 3 ఫస్ట్ షెడ్యూల్ స్టార్ట్

టిఎస్ఆర్ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నిర్మితమవుతున్న ప్రొడక్షన్ నెంబర్ 3, ప్రేమ మరియు కుటుంబ బంధాలను అద్భుతంగా ఆవిష్కరించే ఒక హృదయస్పర్శి చిత్రంగా రూపొందుతోంది. ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత తిరుపతి శ్రీనివాసరావు...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్