స్వతంత్ర టీవీ, వెబ్ డెస్క్: ప్రమాదవశాత్తు చెరువులో పడి ముగ్గురు బాలికను మృతి చెందిన ఘటన తెలంగాణలోని వనపర్తి జిల్లాలో జరిగింది. శ్రీరంగాపురం మండలంలోని వీరసముద్రం చెరువులో పడి ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు బాలికలు మృతిచెందారు. బట్టలు ఉతకడానికి చెరువు వద్దకు వెళ్లి వీరు చెరువులో పడినట్లు స్థానిక సమాచారం. మృతులను తిరుపతమ్మ(12), సంధ్య(9), దీపిక(7) గా గుర్తించారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేశారు.