Harassment | ప్రేమించలేదని యువతికి ఓ యువకుడు టార్చర్ చూపించాడు. చిత్రహింసలు పెట్టి నానా నరకయాతనకు గురి చేశాడు. ఏపీలోని ఏలూరు జిల్లా పెదవేగి మండలం దుగ్గిరాలలో ఈ ఘటన జరిగింది. తనకు ప్రేమించడం లేదన్న కారణం చేత అనుదీప్ అనే వ్యక్తి.. ఇంజనీరింగ్ చదువుతున్న విద్యార్థినిని చిత్రహింసలకు గురిచేశాడు. గదిలో బంధించి ఒంటిపై వేడి నూనెను పోశాడు. దీంతో నొప్పిని భరించలేని యువతి నానా తంటాలు పడుతూ.. చివరికి ఆ దుర్మార్గుడు అనుదీప్ నుంచి తప్పించుకుని తల్లిదండ్రులకు సమాచారం ఇచ్చింది. వేడి నూనె ఒంటిపై పోయడంతో యువతికి చేతులు, కాళ్లకు తీవ్ర గాయాలు అయినట్లు తెలుస్తోంది. ఈ ఘటనకు సంభందించి పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.