స్వతంత్ర టీవీ, వెబ్ డెస్క్: యాసంగి జొన్న పంటకు మద్దతు ధర చెల్లించి రాష్ట్ర ప్రభుత్వమే సేకరించాలని సీఎం కేసీఆర్ నిర్ణయం తీసుకున్నారు. సీఎం ఆదేశాల మేరకు మార్క్ఫెడ్ను రాష్ట్ర నోడల్ ఏజెన్సీగా నియమిస్తూ యాసంగి సీజన్లో పండించిన జొన్న పంటను మద్దతు ధర చెల్లించి కొనుగోలు చేయాలని ఉత్తర్వులు జారీ చేశారు. మరోవైపు అకాలవర్షం వడగళ్లవానతో పంటలు కోల్పోయిన రైతులకు నష్ట పరిహారం అందిస్తున్నారు. పరిహారం పంపిణీకి వరంగల్ జిల్లా నుంచి మంత్రులు నిరంజన్ రెడ్డి, ఎర్రబెల్లి శ్రీకారం చుట్టారు. కాగా, నష్టపోయిన రైతన్నకు ఎకరాకు పదివేల చొప్పున రాష్ట్ర ప్రభుత్వం పరిహారం పంపిణీ చేస్తుంది.


