Minister Talasani | తెలంగాణలో రానున్న అసెంబ్లీ ఎలక్షన్ లో గోషామహల్లో గులాబీ జెండానే ఎగురుతుందని అన్నారు రాష్ట్ర పశుసంవర్ధక, మత్స్య, పాడి పరిశ్రమల అభివృద్ధి శాఖల మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్. రాంకోటీలోని రూబీ ఫంక్షన్ హాల్ లో ఆదివారం నిర్వహించిన బీఆర్ఎస్ పార్టీ గన్ ఫౌండ్రీ డివిజన్ సమావేశంలో మంత్రి పాల్గొన్నారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ… వచ్చే ఎన్నికల్లో నూటికి నూరు శాతం బీఆర్ఎస్ విజయం సాధించేలా… ప్రతి కార్యకర్త ఇప్పటి నుంచే శ్రమించాలని దిశా నిర్దేశం చేశారు. గోశామహల్ నియోజకవర్గ ప్రజల సమస్యలు పరిష్కరించి అభివృద్ధి పనులు చేసింది కేసీఆర్ సర్కారేనని అన్నారు. నియోజకవర్గంలో పార్టీ నాయకులు క్షేత్ర స్థాయిలో పాదయాత్రలు చేపట్టి ప్రజల సమస్యలను తెలుసుకొని తమ దృష్టికి తీసుకురావాలన్నారు. ఆ సమస్యలను వెంటనే పరిష్కరిస్తామన్నారు.