స్వతంత్ర వెబ్ డెస్క్: ఆంధ్రప్రదేశ్ పదో తరగతి అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షల ఫలితాలు శుక్రవారం ఉదయం రిలీజ్ అయ్యాయి. జూన్ రెండు నుంచి పదో తేదీ వరకు జరిగిన టెన్త్ సప్లిమెంటరీ పరీక్షలు జరిగాయి. రాష్ట్రవ్యాప్తంగా 1.87 లక్షల మంది విద్యార్థులు సప్లిమెంటరీ పరీక్షలు రాసిన సంగతి తెలిసిందే. వీళ్లలో పాసైన విద్యార్ధుల సంఖ్య 118588. పాస్ అయినా వారిలో 63.10 శాతం ఉత్తీర్ణతా సాధించారు. ఈ పరీక్షకి 110210 మంది బాలురు హాజరు కాగా.. 65372 ఉత్తీర్ణత సాధించారు. ఇంకా 77713 మంది బాలికలు హాజరు కాగా.. 53216 మంది ఉత్తీర్ణత సాధించారు. బాలురు కంటే 9.16శాతం అధికంగా బాలికలు ఉత్తీర్ణత సాధించారు.