స్వతంత్ర, వెబ్ డెస్క్: జోగులాంబ గద్వాల జిల్లా కేంద్రంలో ఉద్రిక్తత నెలకొంది. దరూరు మాజీ సర్పంచు శ్రీనివాస్ రెడ్డిపై దాడి జరిగింది. గద్వాలలోని ఓ హోటల్ లోశ్రీనివాస్ రెడ్డిపై దాడికి పాల్పడ్డారు దుండగులు. అయితే మాజీ సర్పంచి పై దాడికి పాల్పడిన వారు నడిగడ్డ హక్కుల పోరాట సమితి సభ్యులుగా గుర్తించారు. దీంతో గద్వాలలోని నడిగడ్డ హక్కుల పోరాట సమితి కార్యాలయంపై మాజీ సర్పంచి అనుచరులు దాడి చేసి ఫర్నిచర్ తో పాటు కారును ధ్వంసం చేశారు.దీంతో గద్వాల లో టెన్షన్ వాతావరణం మొదలయింది.