స్వతంత్ర టీవీ, వెబ్ డెస్క్: హైదరాబాద్ జూబ్లీహిల్స్లోని ఫిలిం ఛాంబర్ వద్ద ఉద్రిక్తత నెలకొంది. లైగర్ సినిమా డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబ్యూటర్లు ధర్నా చేపట్టారు. కోట్ల రూపాయలు పెట్టి లైగర్ సినిమా డిస్ట్రిబ్యూషన్ తీసుకున్నామని.. ఇప్పుడు భారీగా నష్టాలు రావడంతో తాము రోడ్లమీదికి వచ్చామని ఆవేదన వెల్లడించారు. గతంలో లైగర్ సినిమా డైరెక్టర్ పూరీ జగన్నాథ్ తమను ఆదుకుంటామని చెప్పి.. ఇప్పటివరకు తమకు ఎలాంటి న్యాయం చెయ్యలేదని వాపోయారు. తమకు న్యాయం జరిగే వరకు ఈ ధర్నా ఇలాగే కొనసాగుతుందని తెలిపారు.


