రాజ్యాంగ విరుద్ధంగా కొనసాగుతున్న తెలంగాణ శాసనమండలిని రద్దుచేయాలని హైకోర్టు న్యాయవాది రాపోలు భాస్కర్ కోరారు. రాష్ట్రపతి, గవర్నర్ వెంటనే జోక్యం చేసుకోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు. లేదా తెలంగాణలో శాసనసభ్యుల సంఖ్య 153 పెంచాలని, కౌన్సిల్కు రాజ్యాంగ భద్రత కల్పించాలని రాపోలు అన్నారు. AP పునర్విభజన చట్టం 2014 సెక్షన్ 27ను అమలు చేయాలని న్యాయవాది భాస్కర్ కోరారు. రాజ్యాంగాన్ని అమలు చేయని వ్యవస్థగా భారత ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజాస్వామ్యాన్ని దెబ్బ తీస్తే పౌర సమాజం ప్రశ్నిస్తుందని అన్నారు. కేంద్రం వెంటనే ఆర్డినెన్సు ద్వారా 153 సీట్లు ప్రకటిస్తే అన్ని సమస్యలు తీరతాయని రాపోలు భాస్కర్ చెప్పారు.