33.2 C
Hyderabad
Monday, June 5, 2023

నేడు లేదా రేపు వర్ష ప్రభావిత జిల్లాల్లో ముఖ్యమంత్రి కేసీఆర్ పర్యటన

తెలంగాణలో వడగళ్ల వాన అల్లకల్లోలం సృష్టించిన నేపథ్యంలో వర్ష ప్రభావిత జిల్లాల్లో ముఖ్యమంత్రి కేసీఆర్ పర్యటించనున్నారు. వడగళ్ల వాన ప్రభావిత జిల్లాల్లో ఇవాళ లేదా రేపు ముఖ్యమంత్రి పర్యటించనున్నారు. వడగళ్ల వాన వల్ల జరిగిన నష్టం వివరాలను తెప్పించాలని ఇప్పటికే సంబంధిత జిల్లా మంత్రులు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, వ్యవసాయ శాఖ అధికారులను సీఎం ఆదేశించారు. ఈ నివేదికలు అందాక.. ఎక్కువ నష్టపోయిన జిల్లాల పర్యటనకు ముఖ్యమంత్రి బయల్దేరనున్నట్లు సమాచారం.

ఇప్పటికే తెలంగాణలో మూడు రోజుల పాటు కురిసిన భారీ వర్షాలకు 2 లక్షల 80 వేల ఎకరాల్లో పంట నష్టం వాటిల్లిందని వ్యవసాయ శాఖ ప్రాధమిక అంచనా వేసింది. 22 జిల్లాల్లో దాదాపు 96 వేల మంది రైతులు పంట నష్టపోయారని తెలిపింది. ఎక్కువగా మొక్కజొన్న… తర్వాత వరి, మిర్చి, వేరుశనగ, పత్తిపంటలు దెబ్బతిన్నాయి. మామిడి, టమోటా, బెండ, ఉల్లి, బొప్పాయి, వంకాయ పంటలు నేలమట్టం అయ్యాయి.

Latest Articles

రోడ్డు ప్రమాదంలో మలయాళ నటుడు దుర్మరణం

స్వతంత్ర, వెబ్ డెస్క్: కేరళలో జరిగిన రోడ్డు ప్రమాదంలో మలయాళ నటుడు కొల్లం సుధి దుర్మరణం చెందగా.. మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. వటకరలోని ఓ కార్యక్రమానికి హాజరై కారులో తిరిగి వస్తుండగా...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

1,850FansLike
641FollowersFollow
251FollowersFollow
19,752SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్