27 C
Hyderabad
Thursday, May 1, 2025
spot_img

కరోనా కల్లోలం… ఒకే స్కూల్లో 15 మంది విద్యార్థులకు కరోనా

Mahabubabad |దేశవ్యాప్తంగా కరోనా కేసులు మళ్ళీ విపరీతంగా పెరుగుతున్నాయి. గత కొన్నిరోజులుగా శాంతించిన కరోనా.. మళ్ళీ నేనున్నా మర్చిపోవద్దు అంటూ.. తన ఉనికిని చాటుకోవడానికి వచ్చేస్తుంది. తాజాగా, తెలుగురాష్ట్రాల్లో కూడా గణనీయమైన కేసులు నమోదవుతున్నాయి. ఇదిలా ఉంటే.. తెలంగాణలోని ఓ గురుకుల పాఠశాలలో కరోనా కలకలం రేపింది. గురువారం మహబూబాబాద్(Mahabubabad) గిరిజన పాఠశాలలోని 15 మంది విద్యార్థులకు కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయ్యింది. దీంతో పాఠశాల ఉపాధ్యాయులతోపాటు… విద్యార్థులు కూడా భయాందోళనలో పడ్డారు. ఈ నేపథ్యంలో విద్యార్థులందరికీ వైద్యసిబ్బంది కరోనా టెస్టులు చేశారు. కరోనా సోకిన విద్యార్థులను ఐసోలేషన్ లో ఉంచారు. కరోనా విజృంభిస్తున్న తరుణంలో ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని.. పాఠశాల విద్యార్థులు కూడా కొన్ని రోజులు అందరితో కలవకుండా కరోనా కట్టడికి కృషి చేయాలని కోరారు.

Read Also: పోలీస్ కమిషనర్ అయితే నాకేంటి.. నా డ్యూటీ నేను చేస్తున్నా

Follow us on:  YoutubeInstagram Google News

 

 

Latest Articles

సర్‌ప్రైజింగ్‌గా ‘కిల్లర్’ గ్లింప్స్

"శుక్ర", "మాటరాని మౌనమిది", "ఏ మాస్టర్ పీస్" వంటి డిఫరెంట్ సినిమాలతో మూవీ లవర్స్ దృష్టిని ఆకట్టుకుంటున్న దర్శకుడు పూర్వాజ్ "కిల్లర్" అనే సెన్సేషనల్ సై-ఫై యాక్షన్ థ్రిల్లర్ మూవీని రూపొందిస్తున్నారు. ఈ...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్