స్వతంత్ర టీవీ, వెబ్ డెస్క్: తెలంగాణ అవతరణ దినోత్సవ వేడుకలను సచివాలయంలోనే నిర్వహించేందుకు కసరత్తు చేస్తుంది కేసీఆర్ సర్కారు. జూన్ 2న సచివాలయం ప్రధాన ప్రాంగణంలో వేడుకలు నిర్వహించాలని నిర్ణయం తీసుకుంది. అయితే ఈ వేడుకల్లో 2 వేల మంది పాల్గొనే అవకాశం కనిపిస్తుంది. తాజాగా, ఈ ఏర్పాట్లపై జీఏడీ సెక్రటరీ సమీక్ష నిర్వహించారు. తెలంగాణ అస్తిత్వాన్ని ప్రతిభింభించేలా కార్యక్రమాలు ఏర్పాటు చేయనున్నారు.