Minister KTR | సచివాలయానికి అంబేద్కర్ పేరు పెట్టడం ఒక విప్లవాత్మకం అని ఐటీ శాఖామంత్రి కేటీఆర్ అన్నారు. పంజాగుట్ట వైఎస్సార్ సర్కిల్ వద్ద బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహాన్ని మంత్రి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. దేశంలోనే అతిపెద్ద అంబేద్కర్ విగ్రహం హైదరాబాద్లో ఏర్పాటు చేసుకోవడం గర్వకారణంమని అన్నారు. అంబేద్కర్ లేకపోతే తెలంగాణ లేదని… ఆ మహనీయుడు రాసిన రాజ్యాంగంవల్లే తెలంగాణ ప్రత్యేకరాష్ట్రంగా ఏర్పడిందన్నారు. పంజాగుట్ట జంక్షన్ కు అంబేద్కర్ జంక్షన్ గా పేరు పెడతామన్నారు. అలాగే పార్లమెంట్ కి కూడా అంబేద్కర్ పెరును పెట్టాలని డిమాండ్ చేశారు. హుస్సేన్ సాగర్ తీరంలో 125 అడుగుల అతిపెద్ద కాంస్య విగ్రహం ఇంతవరకు ఎక్కడా లేదని.. ఇంతటి మహోన్నత నిర్మాణం దమ్మున్న నాయకుడు మన కేసీఆర్ వల్లే సాధ్యమైందని అన్నారు.