లక్డీకాపూల్ వాసవి ఆసుపత్రిలో కార్డియాలజీ విభాగం క్యాత్ ల్యాబ్ ఇన్చార్జి కుంభం కనకారెడ్డి అనుమానాస్పద స్థితిలో మృతిచెందాడు. ఆసుపత్రికి మద్యం సేవించి వచ్చాడంటూ శుక్రవారం నాడు కనకారెడ్డని నర్సింగ్ ఇన్చార్జి శాంతి చితకబాది, అవమానించారు. దీంతో మనస్థాపానికి గురైన కనకారెడ్డి తెల్లవారు జామున అనుమానాస్పదంగా మరణించాడు. కనకారెడ్డిని ఆసుపత్రి నుండి పంపించామని, అతనికి ఏం జరిగినా తమకు సంబంధం లేదంటూ అతని భార్యకు ఆసు పత్రి యాజమాన్యం మెసేజ్ చేయడం అనుమానంగా ఉందని బంధువులు అన్నారు. వాసవి ఆసు పత్రి ముందు కనకారెడ్డి మృతదేహంతో భార్య, కుటుంబ సభ్యులు ఆందోళన చేపట్టారు.


