స్వతంత్ర, వెబ్ డెస్క్: బాసర ట్రిపుల్ ఐటీలో విద్యార్థిని మృతి చెందింది. ట్రీపుల్ ఐటీ పీయూసీ మొదటి సంవత్సరం చదువుతున్న విద్యార్థిని దీపిక.. బాత్రూమ్లో అపస్మారక స్థితిలో పడిపోయింది. స్పృహతప్పి పడిపోవడంతో విద్యార్థినిని భైంసా ఆస్పత్రికి తరలించారు. దీపికను పరిశిలించిన భైంసా వైద్యులు.. అప్పటికే చనిపోయిందని వెల్లడించారు. ఈ ఘటనకు సంభందించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.