స్వతంత్ర టీవీ, వెబ్ డెస్క్: ఏపీలోని పల్నాడు జిల్లా నరసరావుపేటలో సైకో కిల్లర్ అంకమ్మరావును పోలీసులు అరెస్ట్ చేశారు. దీంతో జిల్లా వాసులంతా ఊపిరిపీల్చుకున్నారు. గడిచిన వారంలో అంకమ్మరావు ముగ్గురిని చంపారు. ఒంటరిగా ఉన్నవారిపై బండరాళ్లు విసురుతో దారుణంగా చంపేస్తున్నారు ఈ సైకో కిల్లర్. విషయం తెలుసుకున్న జిల్లా వాసులు గతకొన్న్ని రోజులుగా భయబ్రాంతులకు గురవుతున్నారు. దీంతో అప్రమత్తమైన పోలీసు శాఖ.. సైకో కిల్లర్ ను పట్టుకునేందుకు విచారణ వేగవంతం చేసి…చివరికి అరెస్ట్ చేశారు.