Somu Veerraju | బీజేపీలో చేరిన ఉమ్మడి ఏపీ మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డి(Kiran Kumar Reddy) దూకుడు పెంచారు. ఢిల్లీలోని కేంద్ర పెద్దలతో వరుసగా భేటీ అవుతున్నారు. తొలుత జాతీయాధ్యక్షుడు జేపీ నడ్డా(JP Nadda)ను కలిశారు. అనంతరం కేంద్ర హోంమంత్రి అమిత్ షా(Amit shah)తో భేటీ అయి కాసేపు ముచ్చటించారు. త్వరలోనే ఆయనకు కేంద్రం కీలక పదవి ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. ఈ పరిణామాల నేపథ్యంలో ఏపీ బీజేపీ చీఫ్ సోము వీర్రాజు(Somu Veerraju) ఢిల్లీ పర్యటన ప్రాధాన్యత సంతరించుకుంది. మూడు రోజుల పాటు ఢిల్లీలోనే ఉండనున్న సోము వీర్రాజు పార్టీ పెద్దలతో భేటీ కానున్నారు. ఇటీవల జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఢిల్లీకి వెళ్లడం, కిరణ్ కుమార్ ముఖ్య నేతలను కలవడంతో ఏపీలో రాజకీయ పరిణామాలు మారే అవకాశాలు కన్పిస్తున్నాయని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.
Read Also: పేపర్ లీక్ కేసులో విద్యార్ధికి హైకోర్టులో ఊరట
Follow us on: Youtube, Instagram, Google News