32.2 C
Hyderabad
Sunday, June 1, 2025
spot_img

సోషల్ మీడియా వారియర్స్‌కు అమిత్ షా దిశానిర్దేశం

        కాంగ్రెస్‌, బీఆర్ఎస్, ఎంఐఎం.. మూడు పార్టీలు ఒకటేనని కేంద్ర హోంమంత్రి అమిత్ షా అన్నారు. వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో మెజారిటీ సీట్లు బీజేపీ గెలవాలని పిలుపునిచ్చారు. సికింద్రాబాద్ ఇంపీరియల్ గార్డెన్స్ లో సోషల్ మీడియా వారియర్స్ మీటింగ్‌లో కేంద్ర హోం మంత్రి అమిత్ షా పాల్గొన్నారు. దేశంలో ఎవరిని అడిగినా మోదీ ప్రభుత్వాన్ని మెచ్చుకుంటున్నారని తెలిపారు. కేంద్రం అమలుచేసే పథకాలను ప్రజలకు వివరించాలని సూచించారు. బీఆర్ఎస్‌కు సీట్లు వచ్చినా, రాకున్నా రాష్ట్రానికి ఉపయోగం లేదన్నారు. ఆరు గ్యారంటీల విషయంలో ప్రకటనలకే పరిమితం అయ్యారని విమర్శించారు. మోదీ అవినీతి రహిత పాలన అందించారని అమిత్ షా చెప్పారు. రానున్న లోక్‌సభ ఎన్నికల్లో మళ్లీ బీజేపీదే అధికారమని కేంద్ర హోంమంత్రి అమిత్‌షా ధీమా వ్యక్తం చేశారు. మూడోసారి నరేంద్రమోదీని ప్రధానిగా చూడాలనే భావనలో ప్రజలు ఉన్నారని చెప్పారు. రాష్ట్రంలో 12 కంటే ఎక్కువ సీట్లు దక్కించుకుంటామని అమిత్‌షా ధీమా వ్యక్తం చేశారు.

Latest Articles

‘టిఎస్ఆర్ మూవీ మేకర్స్’ ప్రొడక్షన్ నం. 3 ఫస్ట్ షెడ్యూల్ స్టార్ట్

టిఎస్ఆర్ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నిర్మితమవుతున్న ప్రొడక్షన్ నెంబర్ 3, ప్రేమ మరియు కుటుంబ బంధాలను అద్భుతంగా ఆవిష్కరించే ఒక హృదయస్పర్శి చిత్రంగా రూపొందుతోంది. ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత తిరుపతి శ్రీనివాసరావు...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్