జనగామ జిల్లాలో ప్రమాదవశాత్తు ఆగి ఉన్న గూడ్స్ రైల్లో పొగలు రావడం కలకలం రేపింది. బొగ్గుతో వెళ్తున్న గూడ్స్ రైలులో పొగలు వచ్చాయి. రైల్వే అధికారుల సమాచారంతో ఘటన స్థలానికి చేరుకున్న అగ్నిమాపక శాఖ ఫైర్ ఇంజన్ సాయంతో పొగలను అదుపు చేసేందుకు ప్రయత్నించారు. రైల్వే విద్యుత్ లైన్ నిలుపుదల చేస్తేనే పొగలను అదుపు చేసేందుకు సులభం అవుతుంద ఫైర్ సిబ్బంది అధికారులకు సమాచారం ఇచ్చారు. దీంతో పలు పలు రైళ్లకు అంతరాయం ఏర్పడనుంది.