స్వతంత్ర వెబ్ డెస్క్: తెలంగాణలో ఎన్నికలు దగ్గర పడుతూండటంతో రాజకీయ పరిణామాలు కూడా వేగంగా మారిపోతున్నాయి. కాంగ్రెస్ పార్టీలో(congress party) విలీనం కోసం ఎదురు చూస్తున్న వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ(ysrtp) అధ్యక్షురాలు షర్మిల ఢిల్లీకి వెళ్తున్నారు. తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల్ని ప్రియాంక గాంధీ(priyanka gandhi) తరపున చూసుకుంటున్న ఆయన.. చేరికలు, విలీనాల విషయంలో చురుకుగా ఉంటున్నారు. ఈ క్రమంలో గతంలో డీకే శివకుమార్ తో షర్మిల(sharmila) రెండు, మూడు సార్లు చర్చలు జరిపారు. మరోసారి ఆమె బెంగళూరు వెళ్లినట్లుగా తెలుస్తోంది. డీకే శివకుమార్ తో చర్చల తర్వాత ఢిల్లీకి వెళ్లే అవకాశాలు ఉన్నాయి.
అయితే, ఇటీవలి కాలంలో రాహుల్ గాంధీని షర్మిల సోషల్ మీడియా(social media) అదేపనిగా పొగుడుతున్నారు. తాజాగా రాహుల్ గాంధీ పార్లమెంట్ సభ్యత్వాన్ని పునరుద్ధరించడంపైనా స్పందించారు. నిజానికి రాహుల్ గాందీ లోక్సభ సభ్యత్వం.. సోమవారం పునరుద్ధరించారు. ఒక రోజు ఆలస్యంగా షర్మిల రాహుల్ ను అభినందిస్తూ ట్వీట్(tweet) చేశారు. దీనికి కారణం.. విలీన చర్చల విషయంలో ముందుడుగు పడటమేనని భావిస్తున్నారు.