స్వతంత్ర, వెబ్ డెస్క్: తెలంగాణ ఏర్పడి తొమ్మిదేండ్లు పూర్తయి పదో సంవత్సరంలోకి అడుగుపెడుతున్న సందర్భంగా అమరవీరులకు ఘన నివాళి అర్పించారు వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధినేత్రి వై వైస్ షర్మిల. అనంతరం మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. కేసీఆర్ అధికారంలోకి వచ్చి తొమ్మిదేండ్లు దాటినా ఉద్యమ ఆశయాలు నెరవేరలేదని అన్నారు. కేసీఆర్ కుటుంబానికి మాత్రమే బంగారు తెలంగాణ అయిందని మండిపడ్డారు.
మిగులు బడ్జెట్ రాష్ట్రాన్ని ఐదు లక్షల కోట్ల అప్పుల కుప్ప చేశారని.. తొమ్మిదేండ్లలో 9వేల మంది రైతులు, వందలాది మంది నిరుద్యోగులు ఆత్మహత్య చేసుకున్నారని అన్నారు. ప్రభుత్వ ఆస్తులన్నీ అమ్ముతున్నారని మండిపడ్డారు. లిక్కర్ అమ్మకాలు పెంచి, లిక్కర్ రాష్ట్రంగా మార్చారన్న షర్మిల.. తొమ్మిదేళ్ళ పాలనలో కేసీఆర్ చేశారో.. మేం అడిగిన 10 ప్రశ్నలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.
ఇక రానున్న ఎన్నికల్లో పొత్తులపై స్పందించిన షర్మిల.. కేసీఆర్ తో ఎప్పటికీ పొత్తు ఉండదన్నారు. కేసీఆర్ మెడలు వంచాలన్నా, కేసీఆర్ ను గద్దె దించాలన్న వైఎస్ఆర్ తెలంగాణ పార్టీతోనే సాధ్యమని అన్నారు. సుదీర్ఘ పోరాటం సాగించిన వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ.. ఏ పార్టీలోనూ విలీనం కాదని.. సొంతంగా అభ్యర్థులను బరిలోకి దింపుతుందని.. వచ్చే ఎన్నికల్లో అన్ని స్థానాల్లో పోటీ చేస్తుందని వ్యాఖ్యానించారు.