నెల్లూరు జిల్లా మంగమూరు ఎన్హెచ్ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. రోడ్డు పక్కన ఆగి ఉన్న లారీని వెనక నుండి కారు ఢీకొన్న ఈ ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు అక్కడికక్కడే మృతిచెందారు. మృతులను గంటా రవణమ్మ, దావులూరి శ్రీనివాసులు, వరమ్మ, లక్ష్మ, గంటా నీలిమ, గంటా నందుగా పోలీసులు గుర్తించారు. హైదరాబాద్లో నివాసం ఉంటూ శ్రీరామ నవమి వేడుకలు సొంతూరు జరుపుకునేందుకు నెల్లూరు జిల్లా జలదంకి మండలం శ్యామలకు వారు వచ్చినట్లు పోలీసులు తెలిపారు. ప్రమాదంపై పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారు.