19.7 C
Hyderabad
Wednesday, December 3, 2025
spot_img

జులై 9న నుంచి వారాహి విజయ యాత్ర రెండో దశ

స్వతంత్ర వెబ్ డెస్క్: జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ చేపట్టిన మొదటి దశ వారాహి విజయ యాత్ర విజయవంతంగా ముగిసిన విషయం తెలిసిందే. ఉభయ గోదావరి జిల్లాలో ఈ యాత్ర ముగియగా.. రెండో దశ షెడ్యూల్‌ ఖరారైంది. ఏలూరు నుంచి రెండో విడత యాత్ర చేపట్టాలని పవన్‌ కల్యాణ్‌ నిర్ణయించినట్టు ఆ పార్టీ నేత పి.హరిప్రసాద్‌ ఒక ప్రకటనలో తెలిపారు. ఇవాళ సాయత్రం మంగళగిరిలోని పార్టీ కార్యాలయంలో రెండో దశ యాత్రకు సంబంధించిన ప్రణాళికపై పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్‌ నాదెండ్ల మనోహర్‌తో పవన్‌ సుదీర్ఘంగా చర్చించారు. ఈనెల 9వ తేదీ సాయంత్రం 5గంటలకు ఏలూరులో నిర్వహించే బహిరంగసభతో యాత్ర ప్రారంభమవుతుందని పేర్కొన్నారు. ఏలూరుతో పాటు దెందులూరు, తాడేపల్లిగూడెం, ఉంగుటూరు, తణుకు నియోజకవర్గాల నాయకులతో స్థానిక రాజకీయ పరిస్థితులపై పవన్‌ చర్చించనున్నారు.

Latest Articles

‘టిఎస్ఆర్ మూవీ మేకర్స్’ ప్రొడక్షన్ నం. 3 ఫస్ట్ షెడ్యూల్ స్టార్ట్

టిఎస్ఆర్ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నిర్మితమవుతున్న ప్రొడక్షన్ నెంబర్ 3, ప్రేమ మరియు కుటుంబ బంధాలను అద్భుతంగా ఆవిష్కరించే ఒక హృదయస్పర్శి చిత్రంగా రూపొందుతోంది. ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత తిరుపతి శ్రీనివాసరావు...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్