చంద్రబాబును ప్రజలు నమ్మడం లేదని… టీడీపీని ప్రజలు చెత్తబుట్టలో వేశారని ఎద్దేవా చేశారు ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి. ప్రజల్లోకి వెళ్లి ఏం చెప్పాలో చంద్రబాబుకు తెలియడం లేదని విమర్శిం చారు.. అన్ని అనుమతులు తీసుకున్నా ప్యాంటీ కారుపై తప్పుడు ప్రచారం చేశారని ఆగ్రహం వ్యక్తంచేశారు. బీజేపీలో ఉన్న టీడీపీ నేతలకే టికెట్లు ఇచ్చారని తెలిపారు.మళ్లీ ఇప్పుడు మోసపూరిత హామీలతో చంద్రబాబు వస్తున్నారని… ఏ పార్టీ వైపు ఉండాలో ప్రజలు నిర్ణయించారన్నారు.. స్పష్టమైన అజెండాతో వైసీపీ ఉందని ప్రజలకు తెలుసన్నారు..