స్వతంత్ర, వెబ్ డెస్క్: తెలంగాణ ఏర్పాటు సమయంలో అరవై వేల కోట్ల అప్పు ఉంటే ఇప్పుడు ఆరు లక్షల కోట్ల అప్పు చేశారని మండిపడ్డారు బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షులు ఆర్ ఎస్ ప్రవీణ్ కుమార్. నిరుద్యోగ సమస్యల మీద ఒక్క మాట సీఎం మాట్లాడలేదన్నారు. టీఎస్పీఎస్సీ దొంగల్ని పట్టుకోకుండా ఇప్పుడు చిన్నచిన్న వాళ్ళను అరెస్ట్ చేస్తున్నారని మండిపడ్డారు. బీఎస్పీ నాయకురాలు మాయావతి నాడు 36 మంది సభ్యులతో తెలంగాణకు మద్దతు ఇచ్చారని గుర్తుచేశారు. అమరవీరుల కలలు సాధ్యం అయ్యే వరకు పోరాడుతామన్న ప్రవీణ్.. దశాబ్ద కాలంలో శతాబ్ద అభివృద్ధి అంటున్నారని ఎద్దేవా చేశారు. వంద ఏళ్ళ సంపదను కేసిఆర్ కుటుంబం పది ఏళ్లలో కైవసం చేసుకుందని అన్నారు. రాష్ట్రం సిద్దించాక కూడా.. రాష్ట్రంలో ఎవరు సంతోషంగా లేరని అన్నారు.