క్రమశిక్షణకు మారుపేరు రామోజీరావు అని పలువురు సీనియర్ జర్నలిస్టులు అన్నారు. రామోజీ గ్రూప్ సంస్థల అధినేత రామోజీరావు సంతాప కార్యక్రమం ప్రెస్క్లబ్లో జరిగింది. కఠినమైన క్రమశిక్షణ రామోజీ రావు మొదటి లక్షణం అని అన్నారు. 39 సంవత్సరాలు ఛైర్మన్తో కలిసి ప్రయాణించానని గుర్తు చేశారు. విశిష్ట గుణాల మేలు కలయిక రామోజీరావు అని కొనియాడారు. ప్రపంచంలోనే అతిపెద్ద ఫిల్మ్ ప్రొడక్షన్ కేంద్రాన్ని ఆయన నిర్మించారని చెప్పారు. రామోజీ జీవితం నుంచి కొన్ని నేర్చుకుని మనం పాటించినా మంచి విజయాలు సాధించవచ్చు అని అభిప్రాయ పడ్డారు.