రాహుల్‌ గాంధీపై అనర్హత వేటు కంటతడి పెట్టించింది: ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి

MP Komatireddy Venkat Reddy: కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌ గాంధీపై అనర్హత వేటు వేయడం తనను కంటతడి పెట్టించిందన్నారు ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి. గాంధీభవన్ వద్ద చేపట్టిన దీక్షలో ఎంపీ భావోద్వేగ వ్యాఖ్యలు చేశారు. ప్రధాన మంత్రి అయ్యే అవకాశం రాహుల్ గాంధీకి వచ్చినా.. అయన వదులుకున్నారని అన్నారు . అదానీ గురించి పార్లమెంట్‌‌లో రాహుల్ మాట్లాడినప్పటి నుంచి రాహుల్ గాంధీపై కుట్రలు చేస్తున్నారని ఆరోపించారు. అదానీ గురించి రాహుల్ మాట్లాడతారనే భయం బీజేపీలో మొదలైందని…అందుకే పరువునష్టం కేసులో శిక్ష పడేలా చేశారని అన్నారు. రాహుల్ పై అనర్హత వేటు ఎత్తివేసే వరకు కాంగ్రెస్ శ్రేణులు కలిసి కట్టుగా పోరాడాలని అన్నారు. అవసరమయితే కాంగ్రెస్ ఎంపీలందరూ రాజీనామా చేయాలని కోమటిరెడ్డి పిలుపునిచ్చారు. ఇంధిరాగాంధీపై వేటు వేస్తే ఏం జరిగిందో.. ఇప్పుడు అదే జరుగుతుందన్నారు కోమటి రెడ్డి వెంకటరెడ్డి.

Rahul Gandhi's disqualification brought tears to his eyes: MP Komatireddy Venkat Reddy

Latest Articles

కమీషన్లు, స్కామ్‌ల కోసమే ప్రాజెక్టులు- రామచందర్‌ రావు

సీఎం రేవంత్‌ రెడ్డిపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్‌ రావు సంచలన వ్యాఖ్యలు చేశారు. సీఎం రేవంత్ లేఖ ఒక బూటకమని అన్నారు. సీఎంకు చాతకాకపోతే అధికారంలోకి రాగానే బీజేపీ మెట్రో రైల్...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

5,500FansLike
31,700FollowersFollow
347FollowersFollow
424,168SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్