24.5 C
Hyderabad
Wednesday, July 9, 2025
spot_img

లారీలో రాహుల్ గాంధీ ప్రయాణం.. డ్రైవర్లతో మమేకం

స్వతంత్రటీవీ, వెబ్ డెస్క్: కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ప్రజలతో మమేకమవుతున్న తీరు అందరినీ ఆకట్టుకుంటుంది. ఎప్పుడైతే రాహుల్ భారత్ జోడో యాత్ర మొదలుపెట్టారో అప్పటి నుంచి ఆయన వ్యవహారశైలి పూర్తిగా మారిపోయింది. వేషధారణతో పాటు మాట్లాడే తీరు, జనాల్లో కలిసిపోయే ఓర్పు రాహుల్ ను భారత రాజకీయాల్లో మరోస్థాయికి తీసుకువెళ్తున్నాయి. తాజాగా సోమవారం రాత్రి ఓ లారీలో ఢిల్లీ నుంచి చండీగఢ్ వరకు ఆయన ప్రయాణించారు. అనంతరం అంబాలాలో ఆగి డ్రైవర్లతో మాట్లాడి వారి సమస్యలను తెలుసుకున్నారు.

కాంగ్రెస్ పార్టీ ఇందుకు సంబంధించిన వీడియోలను ట్వీట్టర్ లో పోస్ట్ చేసింది. దేశంలోని రోడ్లపై దాదాపు 90 లక్షల మంది ట్రక్ డ్రైవర్లు ఉన్నారు. డ్రైవర్ల ‘మన్ కీ బాత్’ వినే పనిని రాహుల్ చేశారని పేర్కొంది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దేశ్ కీ నేత రాహుల్ గాంధీ అంటూ కాంగ్రెస్ కార్యకర్తలతో పాటు నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.

Latest Articles

‘టిఎస్ఆర్ మూవీ మేకర్స్’ ప్రొడక్షన్ నం. 3 ఫస్ట్ షెడ్యూల్ స్టార్ట్

టిఎస్ఆర్ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నిర్మితమవుతున్న ప్రొడక్షన్ నెంబర్ 3, ప్రేమ మరియు కుటుంబ బంధాలను అద్భుతంగా ఆవిష్కరించే ఒక హృదయస్పర్శి చిత్రంగా రూపొందుతోంది. ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత తిరుపతి శ్రీనివాసరావు...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్