34.2 C
Hyderabad
Monday, March 17, 2025
spot_img

ఉపాసనకి బహుమతిని అందచేసిన ప్రజ్వల ఫౌండేషన్

స్వతంత్ర వెబ్ డెస్క్: గ్లోబల్ స్టార్ రామ్ చరణ్- ఉపాసన జంట గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. టాలీవుడ్ మోస్ట్ బ్యూటిఫుల్ కపుల్స్‌లో ఈ జంట ఒకరు. ఈ జంట త్వరలోనే తల్లిదండ్రులు కాబోతున్న సంగతి తెలిసిందే. అయితే తాజాగా ఉపాసనకు ఓ ఊహించని బహుమతి అందింది. ఆ గిఫ్ట్​ను ఆమె సోషల్​మీడియా వేదికగా పంచుకున్నారు. ఈ క్రమంలోనే ఉపాసన సోషల్​మీడియా ఇన్​స్టాలో తమ బిడ్డ కోసం చేయించిన ఊయల గురించి పలు విశేషాలను షేర్ చేశారు. తమకు పుట్టబోయే బిడ్డ కోసం ప్రజ్వలా ఫౌండేషన్ సంస్థ ఓ ప్రత్యేకమైన ఊయలను కానుకగా ఇచ్చారని చెప్పుకొచ్చారు. ఊయల ప్రాముఖ్యతను దాన్ని తయారుచేసిన విధానాన్ని వివరించారు.సెక్స్ ట్రాఫికింగ్‌లో చిక్కుకొని బయటపడిన మహిళలకు.. ప్రజ్వల ఫౌండేషన్‌ ఉపాధితో పాటు ఆశ్రయం కల్పిస్తోంది. వారిలోని కొందరు మహిళలే ఈ ఊయలను తయారు చేశారని ఉపాసన చెప్పారు. వారు తయారు చేసిన ఈ ఊయల.. ఎంతో ప్రాముఖ్యతను కలిగి ఉంటుందని తాను భావిస్తున్నట్లు తెలిపారు. “అతి త్వరలో మేం ముగ్గురం కాబోతున్నాం. నా బిడ్డ కోసం మీరు చేతితో తయారు చేసి ఇచ్చిన ఈ ఊయల ఎంతో ప్రాముఖ్యత కలిగి ఉంటుందని భావిస్తున్నాను. ఇది వారిలోని ధైర్యం, బలం, ఆత్మగౌరవం ఆశకు ప్రతీకగా నా బిడ్డకు గుర్తుండిపోతుంది. మా అందమైన ప్రయాణంలో అంతర్భాగమైనందుకు ప్రజ్వల ఫౌండేషన్‌కు ప్రత్యేక కృతజ్ఞతలు” అని ఉపాసన రాసుకొచ్చారు.

Latest Articles

‘కాలమేగా కరిగింది’ ట్రైలర్ చూశారా?

వినయ్ కుమార్, శ్రావణి మజ్జరి, అరవింద్ ముదిగొండ, నోమిన తార ప్రధాన పాత్రల్లో నటిస్తున్న సినిమా "కాలమేగా కరిగింది". ఈ సినిమాను శింగర క్రియేటివ్ వర్క్స్ బ్యానర్ పై మరే శివశంకర్ నిర్మిస్తున్నారు....
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్